Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులు
జగద్గురు అవతారము

-బాలకృష్ణ

త్రయీ తనువని సూర్యునికి పేరున్నది. అత్యున్నత తారాపథంలో కోటాను కోట్లమైళ్ళదూరంలో ప్రకాశిస్తున్నా తన కిరణాలను ఎంతదూరమైనా క్రిందికి ప్రసరింపచేసి చేతన పదార్థాల కెల్ల ఉత్తమ శక్తిని ప్రసాదించే లోకరక్షకుడై, కర్మసాక్షియైన సూర్యుడు పరంజ్యోతి స్వరూపాని కభిన్నుడు, కాన అతనిని వేదస్వరూపునిగా విజ్ఞులు ఉపాసించడం యుక్తమేకదా! అదేవిధంగా సనాతన బ్రహ్మ స్వరూపమే యైన ఆత్మను జ్ఞానాగ్ని దగ్ధకర్ములై, కఠోర తపశ్చర్యా నిరస్త సమస్తవాసనా సందోహులై సచ్చిదానంద స్వరూపంగా ప్రజ్వరిల్ల జేసికొని - తమ హృదయాన్ని లోకులను రక్షించుచున్న సనాతనధర్మమనే మాతృరూపంగా వాత్సల్య పరిపూర్ణం గావించుకొని లోకో జ్జీవనమే తమకర్తవ్యంగా చేపట్టిన మహనీయులను వేదస్వరూపులని యారాధించడం మన కర్తవ్యం.

అవిచ్ఛిన్నంగా అట్టి మహనీయులను గాంచి, పుణ్యసంతతిని పండించుకొనుచున్న భారతావ నిలో దక్షిణభాగంలోని విళ్లుపురంలో నిప్పటికి డెబ్బదిరెండేళ్ళకు మునుపు - అనగా జయనామ సంవత్సర సౌరమాన వైశాఖమాసమున 8 వతేదీన అనురాధానక్షత్రంతో కూడిన 1814 మే 20 వ తేదీన సనాతన ధర్మపరాయణులైన పుణ్యదంపతుల పునీత గర్భంలో విజ్ఞానభాస్కరుడుద యించెను, కాదు- ఆద్యంత రహితమై ప్రకాశించు బ్రహ్మము కరచరణాద్యవయవములతో నొక దివ్య సౌందర్యరూపము దాల్చి తన్ను ధన్యునింజేయదోచిన వింతను మానవు డానాడు కన్నులార గాంచెను. ఆ బ్రహ్మకిశోరమునకు తల్లిదండ్రులు ''స్వామినాథు''డని పేరిడిరి, లోకమర్యాద ననుసరించి స్వామినాథుడు పాఠశాలలో జేరి తన అనితర సాధారణ మేధావిలాసముచేత ఉపాధ్యాయులను ముగ్థులంగావించెను అన్ని మతములు, అన్ని భాషలు ఒక బ్రహ్మమునే ఉపాసింప విభిన్న మార్గములన్న సత్యమును లోకులకు జాటుటకు కాబోలు స్వామినాథుని విద్యా భ్యాసము క్రైస్తవులచే నడుపబడుచున్న ఆంగ్లపాఠశాలలో ప్రారంభ##మైనది. ఆ కాలంలో కింగ్‌ జాన్‌ నాటకమున వీరు ''ప్రిన్సుఆర్థర్‌'' పాత్రను నిర్వహించిన విశిష్టతచే ఆపాత్ర ప్రశంసనీయత గాంచినదన్న నది అతిశయోక్తి కాదు.

8-23

వీరి పవిత్ర జీవితంలో 1907 ఫిబ్రవరి 13వ, తేదీ యత్యంత ముఖ్యమైనది. ఆనాడే వీరు తమ యవతార ప్రయోజనమును క్రియారూపమున నిర్వహింప దీక్షవహించిరి. ఆకాలములో శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులై వెలసియుండిన స్వాములవారు ఉత్తరార్కాటుజిల్లాలోని కలవైకి విజయము చేసియుండిరి. వారు తమ సన్నిధికి తండ్రి వెంట నరుదెంచిన స్వామినాథుని వీక్షించి తనయనంతరము పీఠము నధిరోహింప శ్రీకామాక్షీ దేవియే వుంభావమున కిశోరరూపమున దోచినదని యూహించి యుప్పొంగిరి. ఆ సందర్భములో నొకనాడు స్వాములవారు తాము సిద్ధిపొందవలసిన కాలమత్యంత సన్నిహితమైనదని తెలిసికొని వెంటనే తన్ను జూడరమ్మని స్వామినాథునకు వార్తపంపిరి. కాని, ఆహ్వానము స్వాములవారి కందులోపల కార్యము మించి, మరొక బాలుని పీఠమున నిలుపవలసి వచ్చినది. దైవచిత్రమేమొకాని ఆ బాలుడును ఎనిమిది దినములు మాత్రమే పీఠాధిపతిగా నుండి ముక్తుడయ్యెను, ఆ సందర్భమున 1907 ఫిబ్రవరి 13వ. తేదీన పరాభవనామ సంవత్సర మాసినెల 2వ, తేదీన స్వామినాథుడు తనపదమూడవయేట పీఠము నధిరోహించి, 'చంద్రశేఖరేంద్రసరస్వతి' యను దివ్యనామముతో విరాజిల్లుచు, ఆది మొదలు నిర్విరామముగా లోకులు ధర్మపరుల గావించి, కృతకృత్యులం గావించుచు వెలయుచున్న తీరు జగద్విఖ్యాతము. వీరు ఆసేతుహిమ శైలము దిగ్విజయ యాత్ర గావించి యవ్యాజప్రేమచే లోకుల చిత్తములను జూరగొనుచు అసంఖ్యాకులగు భారతీయుల కర్తవ్య పరాయణుల గావించిరి.

మత సిద్ధాంతముల తర్కశాస్త్రరీతిని విపులీకరించి శ్రోతల మస్తిష్కముల జటిల సమస్యలతో నింపుటగానీ తనకు నచ్చినదొక్కటే తరుణోపాయమని సిద్ధాంతీకరించుట గానీ, శ్రీవారి విధానము కాదు, తన్ను జేరిన వారి యార్తిమెట్టిదో గుర్తించి తదనుగుణముగా చికిత్స గావించు ఉత్తమ భిషగ్వరువలె సంశ్రితుల సంస్కారబలమును గుర్తించి తదనుగుణముగా కర్తవ్య పథమును నిర్దేశించి వారల చరితార్థుల గావించుట శ్రీవారి విశిష్టత. శ్రీవారి యుపన్యాసములు ఆలకించువారి మేధాశక్తిని పరీక్షించు నవి కాక, వారి హృదయముల బులకింప జేసి ధర్మభరితుల గావింప గల ప్రభావముతో గూడినవై యుండును. ఆలకించు ప్రతివ్యక్తియు తన్నుగురించియే యా యుప దేశములు గావింపబడుచున్నవను విశ్వాసము గలిగి, క్రియాశూరుడు కాగలుగునట్లు చేయ సమర్థములై యుండును. ఆశ్రయించిన వారెవరైనను ఆత్మబంధువను నమ్మకము బుట్టించి వారు తమ కష్టసుఖములను చెప్పుకొనగా చెవియొగ్గివిని, యుపశమనోక్తులతో హితము నుపదేశించి, పరమాప్తులై వెలయు కరుణామూర్తి శ్రీవారు, ఏమూల ఏధర్మ మభివ్యక్తమైనను దానిని తన ప్రభావముచే నుద్దీప్తము గావించు ఉత్తమశీలము శ్రీవారిది. ఇటీవల చెన్నపురి వీధిలో విపన్నులై పడియున్నవారలను చికిత్సాలయమునకు చేర్చి కాపాడి మానవధర్మమును పాటించిన వనిత లక్ష్మికి శ్రీవారు విశ్వప్రేమతో పరిపూర్ణమైన బిందెను ప్రసాదించుటకు జూడగ ఎక్కడ ఏపైరున కెంత నీరుకావలెనో యంతవరకు తానైప్రవహించి యాపైరు రక్షింప బూను మందాకినీ ప్రవాహము వలె శ్రీవారు కరుణయను వెల్లువయు తనంత తాను విశ్వమందన్నియెడల వ్యాపించుచు ధర్మమను పంటను పండించుచున్న దనుట యతిశయోక్తి కాదు. ఒక భారతీయుడేమి? ఏ విదేశీయుడైన, ఏ మతా వలంబకుడైన శ్రీవారిని దర్శించు భాగ్యమబ్బినపుడు స్వమతసిద్ధాంతఫలమును వీక్షింప గలిగితి నన్న విశ్వాసముతో హృదయపూర్వకముగా నభివాదన మొనర్చుననుటకు ఆయా సందర్భములలో విదేశీయులగు ప్రముఖులు శ్రీవారిని సందర్శించి ముగ్ధులై గావించిన ప్రకటనలే ప్రబల నిదర్శనములు, ''పోవు'' మనదేశానికి విజయము చేసినపుడు అన్యమతాధిపతికి భారతీయులు వసతి గల్గింపవలదనుచ శ్రీవారు మన దేశీయుల కందించిన సందేశము శ్రీవారి విశాల హృదయమునకు. విశ్వమానవ సౌహార్ధమునకు సర్వమత సహనపరాకాష్ఠకు నిదర్శనము కాక మరేమి?

శ్రీవారు అపుడపుడు లోకులకు గావించిన యుపదేశముల సారాంశ మిదియే - ''ఒక బ్రహ్మమే మూడుగను, ముప్పదిమూడుగను, ముప్పదిమూడు కోట్లుగను, అసంఖ్యాకముగను భాసించు చున్నది. విశ్వుములో అత్యున్నతము శ్రేష్ఠతమము నగునది సత్యం-శివం-సుందరము నగు పర తత్త్వమే. ఆ సత్యస్వరూపాన్ని గుర్తించి యందుకోగలుగుటకే ఈ లోకములో ఇన్ని సంప్రదాయములు, ఇన్ని మతములు ఏర్పడియున్నవి. పరతత్త్వమునెడ విశ్వాసము నుద్బో ధింపని మతములేదు. అఖిల విశ్వములకు దివ్యచైతన్యము నొసంగు పరాత్పరు డొకడై యుండగా అన్ని మతముల లక్ష్యము నొక్కటియే యని తెలియవచ్చుగదా! తమ సమకాలీనుల సంస్కృతి, మనఃపరిపక్వత, వాసనాబలముల గుర్తించి మతాచార్యులు కాలానుగుణముగా మత సిద్ధాంతములను, అనుష్ఠానములను రూపొందించిరి. సూక్ష్మముగా పరిశీలించు విజ్ఞులకు వారి 5 సిద్ధాంతములు పరస్పర విరోధములు కావని తెలియవచ్చును. ఆ సిద్ధాంతములలోని సామ రస్యమును గుర్తింపజాలని మితప్రజ్ఞులగు ఆ యా మతావలంబకుల దృష్టి విమర్శలోపముల వల ననే తమమతమే గొప్పదను సంకుచిత మనస్తత్వము వ్యాపించినది. ఏ మతమువారైనను పరుల విమర్శింపక తమమత ధర్మనిష్ఠాభిరతులైన ప్రవర్తించుటొక్కటే తరుణోపాయము. అట్టివారు స్వధర్మమున నెంతవిశ్వాసము శ్రద్ధకలిగి యుందురో పరమతము నెడనంత సహన భావమును గలిగియుందురు. ''దైవమును గుర్తింపుమని'' బోధించుమత మేదైనను దానిని వదలి నామతము నవలంబింపుమని నితరునకు ఉపదేశించినచో దైవమును విస్మరింపుమని నిర్బంధించుటే యగునుకదా, కాన తమపూర్వుల అడుగుజాడలలో నడచుటే ప్రతివానికి స్వధర్మము, పరమాత్ముడు సత్యస్వరూపుడు కాన సత్యమును బాటింపనివాడు దైవస్వరూపమును గుర్తింపజాలడు, తితిక్ష, ఐహిక సుఖములతో సంయమనము, నిర్మలచిత్తము, ధర్మాభిరతి, జీవిత లక్ష్య సాధనమున పరమోత్సుకత స్వధర్మానుష్ఠానమువలన కలుగు మనోవికాసము, పరులు తనకు గావించు అపకారముల మన్నింప సమర్థమగు క్షమాశీలము, మనోవాక్కాయములను - తన సంపదలను ధర్మసంవర్థనముననే వినియోగింపవలె నన్న జాగరూకత అను నవి మానవు నభ్యుదయ పథగామి గావించు నుత్తమ గుణములు, బాహ్యజీవితమునక వలసిన పరికరముల 6 సేకరించుటలోనే కాలమెల్ల గడవక ప్రతివ్యక్తియు ఆత్మశ్రేయమును బడయుటకు కొంత యవకాశమును కల్పించుకొని సాధనపరుడు కావలెను. వ్యాధికి తగిన ఔషధమన్నట్లు వారి వారి వాసనా సంస్కృతుల కనుగుణముగ అనుష్ఠానము లేర్పడి యున్నవి. వానిలో హెచ్చుతక్కువలు లేవు. తమ కేది యుపయుక్తమో ఆ యనుష్ఠానమున పరిపూర్ణ శ్రద్ధవహించుటయే ఉత్తమోత్తమ మైనది అనాదిగా వెలుగు భాస్కరునిలో ప్రాత కొత్తలు లేవు. అట్టిదే ఆర్యధర్మము, బాహ్య జీవనోపయుక్త సాధనములలో మార్పులు డెచ్చునేటి విజ్ఞానశాస్త్ర మెంత యభివృద్ధి పొందినను నిత్యమై, సత్యమై, అనాదియై పరిపూర్ణమునై యున్న ఆత్మతత్వమును వివరించు సిద్ధాంతములు గాని, ఆత్మసముద్ధరణోపాయములు గాని, ఎన్నటికిని కుంఠీభూతములు కాజాలవు. అందలి యథార్థతను గుర్తింపజాలని బలహీన మనస్సుల కందలి ప్రభావ మందరాకుండుట వస్తులోపము కాదు-దృష్టిలోపము, కాన ధార్మిక ప్రవర్తన మొక్కటే మానవాభ్యుదయమును జేకూర్చుననుట అమోఘ సత్యవచనము.''

విశ్వమానవ కళ్యాణమున కనవరతము నిట్టి సదుపదేశముల మూలమున ధర్మానుష్ఠానముల పరివృద్ధి నందింప జేయుచు నుద్ధీసించు శ్రీవారి దివ్యమంగళవిగ్రహము భారత ధర్మ పరమేశ్వర మకుటాలంకార మగు అవక్రచంద్రరేఖ - శ్రీవారి యవ్యాజ కరుణాపరి పూర్ణహృదయము సర్వ మంగళయగు జగన్మాతృ స్వరూపము. శ్రీవారి సంకల్పము ఆరధర్మమునకు శ్రీరామరక్ష, శ్రీవారి ముఖమున దోచు మందహాసము అంతర్గుప్త బ్రహ్మతేజో విలాసరేఖ, శ్రీవారిపలుకులు ఉపనిషత్సారామృతమున దోచి ధర్మదేవత తనవత్సలుల కందించు నన్నంపు ముద్ద. శ్రీవారి కటాక్షము పురాకృత పుణ్యఫలము, శ్రీవారి శ్రీచరణములు ధర్మమార్గ ప్రవర్తకుల కాదర్శము.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page